మహోన్నత మూర్తి మత్వం, అద్భుత కార్యదీక్ష

Lakshmi Prabha
August 17, 2023

చదువు, సంపాదన, హోదా, అధికారం ఉన్నవాళ్ళలో చాలామందికి ఎంతో కొంత ఆభరణంగా అహంకారం కూడా ఉంటుంది. చేసేది చేయించేది అంతా ఆ భగవంతుడే తాను నిమిత్తమాతృడిని అని తలంచి, ఆనందానికి ఉప్పొంగక, దుఖాఃనికి క్రుంగిపోక, అధికార దర్పానికి ఆనందపడక, నిబద్ధతతో, ధర్మానికి కట్టుబడి నిరంతర కార్యదీక్షతో అలుపెరుగక పనిచేసినవారు, స్థితః ప్రజ్ఞులు, నిరాడంబరులు, నిరహంకారులు ఈనాటి ఈ దాసుభాషితంకు తొలినాళ్ళలో ఊతం ఇచ్చిన వారు...

Read more

నాహం కర్తా, హరిః కర్తా..

Meena Yogeshwar
August 8, 2023

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరుని దర్శనం సామాన్య భక్తునికి ఎంత నాణ్యతతో అందించగలనా అని నిరంతరం తపించిన ప్రసాద్ గారి గురించి ఈ పుస్తకంలో మనం చాలా తెలుసుకున్నా, దాసుభాషితం ప్రసంగాలు కార్యక్రమంలో పాల్గొన్నవారి వలన ప్రసాద్ గారి గురించి మనకు తెలిసినదేమిటంటే...

Read more

పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా..!

Meena Yogeshwar
July 31, 2023

1980లకు ముందు తిరుమల మాఢ వీధులు రకరకాల చిల్లర కొట్లతో, బిచ్చగాళ్లతో, పూసలు, దండలు అమ్ముకునేవాళ్ళతో, నకిలీ కాసులు అమ్ముకునేవాళ్ళతో, ఆలయానికి సంబంధం లేని క్షురకులతో, ఆవులు-దూడలతో కిక్కిరిసిపోయి ఉండేవి. వీటికి దగ్గరలోనే గుడిసెలు, మురికి వాడలు దర్శనమిచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ మధ్యలో గుడి ఉన్నట్టుగా ఉండేది. దీంతో దొంగలు, యాత్రికులను బురిడీ కొట్టించి సొమ్ము దండుకునే దళారులు రెచ్చిపోయేవారు. ఇవి 1980వ దశకం ముందు వారి తిరుమల యాత్రా అనుభవాలు. ఇప్పటి వారు ఆ తిరుమలను కలలో కూడా ఊహించలేరేమో కదా. అలా మార్చినది ఎవరో తెలుసా?

Read more