
ఒక యువకుడు తాను కూర్చున్న కొమ్మని నరుకుతున్నాడు. రాజుపై కోపం కలిగిన ఒక పండితుడు ఇతణ్ణి తీసుకువెళ్ళి, మాహా విద్వాంసుడని అబద్ధం చెప్పి, రాకుమార్తెకు ఇచ్చి వివాహం జరిపిస్తాడు. మొదటి రాత్రి భార్య అతణ్ణి పలకరిస్తూ ‘అస్తి కశ్చిత్ వాగ్ విశేషః’ అంటే ‘ఏమైనా కబుర్లు/విశేషాలు ఉన్నాయా’ అందిట సాహితీ చర్చకు ప్రారంభంగా. ఆయన బుర్ర గోక్కుని తనకేమీ రాదని చెప్పాడట. ఎంతో ఆశాభంగం అయిన భార్య, ఆ జగదంబను వేడుకుంటే కనీసం మాట్లాడడమైనా వస్తుంది అని భర్తకు ఉపదేశించింది.ఆ అమ్మ ఆలయానికి వెళ్ళాడు. మనసు లగ్నం చేసి, ఘోర తపస్సు చేశాడు. సకల విద్యల తల్లి శ్యామలాంబ ప్రత్యక్షమైంది. అతని నాలుకపై బీజాక్షరాలు రాసింది. అంతే...
Read more
మల్లీశ్వరి సినిమాలో "ఆకాశవీధిలో...", "మనసున మల్లెల..." రెండు పాటలలో "హాయి" అనే పదం ఉంటుంది. ఆ రెండు పలికిన తీరులో వ్యత్యాసం మీరెప్పుడైనా గమనించారా? "ఆకాశవీధి" పాటలో హాయిగా అనడంలో ఒక నిష్ఠూరం ఉంది. "మనసున మల్లెల" పాటలో ‘హాయి’ అనుభవైక్యమైన భావన ఉంది. ఆ విభిన్న భావాలను భానుమతి గారు చాలా స్పష్టంగా పలికించారు. ఇటువంటి subtle nuances వివరిస్తూ...
Read more
నెల నెలా మొదటి శనివారం 'దాసుభాషితం ప్రసంగాలు' నిర్వహిద్దామనుకుంటున్నాము.ఇందులో తెలుగు సమాజంలో ఉన్న వివిధ రంగాల్లో ఉన్న నిపుణులతో ప్రసంగం ఇప్పించాలని ఆలోచన. ఈ ప్రసంగాలు భాషా, సాహిత్యం, సంగీతం, కళలు, చరిత్ర, ఆధునిక శాస్త్రాలు మొదలైన వాటిపై ఉంటాయి. ప్రసంగీకులు సెలబ్రిటీస్ అయ్యుండవలసిన అవసరం లేదు. కానీ Subject Matter Experts మాత్రం అయ్యుంటారు. మన సమాజంలో ఉన్న ఎందఱో ఆణిముత్యాలను పరిచయం చేసే అవకాశాన్ని దాసుభాషితం ఇలా కల్పించుకుంటుంది.
Read more